Andhra Pradesh Weather Report: ఏపీని వణికిస్తున్న భానుడు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, 33 మండలాలకు వడగాడ్పుల హెచ్చరిక

ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురు­వారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Heat wave. Representational Image. (Photo Credits: Pixabay)

ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురు­వారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినా­డలో ఒకటి, ఎన్టీఆర్‌ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్‌ జిల్లాలో 8 మండలాల్లో వడగా­డ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటా­యని అంచనా వేస్తున్నారు.

ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..

శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీ­ఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్న­మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదా­వరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement