AP Assembly Sessions 2022: టీడీపీ డేటా చౌర్యానికి పాల్పడింది, సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేయాలని చూసింది, అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమన

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని..పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు.

MLA Bhumana Karunakar Reddy (Photo-Twitter)

Amaravati, Sep 20: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని..పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2022) భాగంగా.. ఇవాళ (మంగళవారం) డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్‌ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు.

ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్‌ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు.

మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు అభివృద్ధి, అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది, విద్యారంగంపై సీఎం జగన్

ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచి సేవా మిత్ర అనే యాప్‌ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Delhi Assembly Elections 2025: ఢిల్లీలొ ముగిసిన ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదు, ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

Share Now