Capital Assigned Lands Case: రాజధాని అసైన్డ్ భూముల కేసు, హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 21వ తేదీలోపు పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదికి నోటీసులు జారీ
గత ప్రభుత్వంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో (Capital Assigned Lands Case) సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో అవకతవకలను, అక్రమాలను వెలికితీసేందుకు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నసీఐడీ దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Amaravati, Sep 12: గత ప్రభుత్వంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో (Capital Assigned Lands Case) సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో అవకతవకలను, అక్రమాలను వెలికితీసేందుకు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నసీఐడీ దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మేం సంతృప్తిగా లేమని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఇక్కడ ఆరోపణలు కేవలం ఒక్క వ్యక్తితో ముడిపడి లేవని తెలిపింది. ఇందులో భారీ కుంభకోణం (Amaravati land transactions irregularities) కూడా ఉండవచ్చు కదా. అందులో ఏముందో తెలియదు.. దర్యాప్తు కొనసాగేందుకు అనుమతించాలి కదా.. అందువల్ల ఈ కేసును త్వరగా పరిష్కరించాలని మేం హైకోర్టుకు (AP High Court) సూచిస్తాం..’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది.
తుళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను గత ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదంటూ నమ్మించి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. ముందుగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘ప్రతివాదులపై ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధం ) చట్టం–1977లోని సెక్షన్ 7 కింద ఫిబ్రవరి 27న సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలో ఈ కోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా విస్మరించి ఎఫ్ఐఆర్ నమోదైన రెండు వారాల్లోనే దర్యాప్తుపై స్టే ఇచ్చిందని తెలిపారు.
ఈ స్కాంలో నిందితులుగా ఉన్న బ్రహ్మానందరెడ్డి తదితరులపై ఉన్న ఆరోపణలు చిన్నవి కావని వేలాది ఎకరాల భూములకు సంబంధించినవని, ఇందులో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయని కోర్టుకు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ హైకోర్టు స్టే విధించిందని, అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటే నష్టపరిహారం రాదని, తమకు బదిలీ చేస్తే కొంత డబ్బు చెల్లిస్తామని నిరుపేదలను వంచించారని కోర్టుకు తెలిపారు.
ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడికి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదని ఈ వ్యవహారంలో ప్రతివాది, అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్బాబుతో సహా మరికొందరు అధికారులు నిందితులతో కుమ్మక్కయ్యారని న్యాయవాది వాదించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం సమర్థనీయం కాదు’ అని కోర్టుకు ఏపీ తరపు న్యాయవాది నివేదించారు.
తెలుగులో ఉన్న ఎఫ్ఐఆర్ను ఇంగ్లిష్లో అనువదించినప్పుడు తప్పులు చోటు చేసుకున్నాయని అవి సరిచేయకుండా, మా అభిప్రాయం చెప్పకుండా దీనిపై ముందుకు వెళ్లరాదని ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది లూత్రా కోరడంతో ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదికి నోటీసులు జారీచేసింది. ఈనెల 21వ తేదీలోపు పిటిషన్పై సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది.
ఇక ఈ వ్యవహారానికి, రాజధానికి సంబంధం లేదని ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా పేర్కొనటంతో వెంటనే న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు దీనిపై జోక్యం చేసుకుంటూ ‘తుళ్లూరు అమరావతి పరిధిలోనిదే కదా..’ అని ప్రశ్నించారు. ‘దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మేం సంతృప్తిగా లేం. ఆరోపణలు కేవలం ఒక్క బ్రహ్మానందరెడ్డితో ముడిపడి లేవు. ఇందులో భారీ కుంభకోణం కూడా ఉండవచ్చు కదా. అందులో ఏముందో తెలియదు.. దర్యాప్తు కొనసాగేందుకు అనుమతించాలి కదా.. అందువల్ల ఈ కేసును త్వరగా పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తాం..’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)