AP PRC Issue: పీఆర్సీపై కొనసాగుతున్న రగడ, ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్న ఉద్యోగ సంఘాలు, ఐఆర్పై వక్రీకరణలు సరికాదని మండిపడిన మంత్రి పేర్నినాని
ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
Amaravati, Jan 20: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై ( AP PRC Issue) జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాలు నేతలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాయి. ప్రభుత్వం (Andhra Pradesh government) దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. పీఆర్సీలో ఫిట్మెంట్ తగ్గించడం, హెచ్ఆర్ఏలో కోత విధించడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. పీఆర్సికి (PRC orders) సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీఓలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. యూనియన్ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 23 శాతం ఫిట్మెంట్ను కాంట్రాక్టర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామన్నారు. ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమలేకనే చేస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగుల ఐఆర్పై వక్రీకరణలు సరికాదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఐఆర్ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు
Tags
సంబంధిత వార్తలు
UK Shocker: విద్యార్థులను లొంగదీసుకుని సెక్స్ కోరికలు తీర్చుకున్న లెక్కల టీచర్, చివరకు గర్బవతి కావడంతో గుట్టురట్టు, జైలు నుంచి వచ్చి మళ్లీ బాలుడితో..
Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్ కు షోకాజ్ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?
Pension Distribution in AP: ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్, విధి విధానాలు ఇవిగో..
Sex With Student in US: స్కూలులో 15 ఏళ్ల విద్యార్థితో టీచర్ సెక్స్, నీ కోసం భర్తను వదిలేస్తానని మాయమాటలు, భర్త ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు
YSR EBC Nestham: మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుధ్దానికి వస్తున్నాయి. వైఎస్సార్ ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి
Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)