AP Local Body Polls: రాజకీయాలు వదిలి పొలం బాట, గుర్తు పట్టలేని కొత్త లుక్తో కనిపించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, గంగులవారి పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న రఘువీరా దంపతులు
ఒకప్పుడు మంత్రి. అలాగే ఏపీసీసీకి అధ్యక్షుడు..కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ సెక్యూరిటీ గార్డులు గన్ మెన్లతో తిరిగే మంత్రి నేడు ఇలా చిన్న మోపెడ్ ండి మీద ోటు కేంద్రానికి వచ్చారు. ఇంతకీ ఈయనెవరొ చెప్పనే లేదు కదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి (Ex APCC President N.Raghuveera Reddy).
Amaravati, Feb 22: ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తుపట్టారా.. ఒకప్పుడు మంత్రి. అలాగే ఏపీసీసీకి అధ్యక్షుడు..కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ సెక్యూరిటీ గార్డులు గన్ మెన్లతో తిరిగే మంత్రి నేడు ఇలా చిన్న మోపెడ్ ండి మీద ోటు కేంద్రానికి వచ్చారు. ఇంతకీ ఈయనెవరొ చెప్పనే లేదు కదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి (Ex APCC President N.Raghuveera Reddy). పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ (AP Local Body Polls) సందర్భంగా గంగుల వారిపాలెంలో ఓటు వేయడానికి వచ్చారు.
మంది మార్బలం లేకుండా ఓ సాధారణ మోపెడ్ వాహనంపై పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. అది కూడా పక్కా రాయలసీమ స్టయిల్లో పంచెకట్టు, చొక్కా, పైన తువాలుతో మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఓటింగ్ కేంద్రానికి వచ్చారు. అంతేకాదు, మోపెడ్ పై తన అర్ధాంగి సునీతను (Sunitha Raghuveer) కూడా తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో రఘువీరారెడ్డి, సునీత దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
Dr. N Raghuveera Reddy Tweet
2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా.. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు ఏపీసీపీ అధ్యక్షుడిగా రఘువీరా కొనసాగారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిన తర్వాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీరా.. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపించేవారు.
రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడయిన రఘువీరా... పాలిటిక్స్కు దూరం పాటిస్తున్నారు. అయితే ఆ మధ్య తన ఊరి చెరువుకు గండి పడటంతో స్వయంగా అనుచరులతో కలిసి రంగంలోకి దిగిన రఘువీరారెడ్డి... స్వయంగా ఇసుక బస్తాలు మోసి ఆ గండిని పూడ్చేశారు. దీంతో అప్పుడు వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సొంతూరులో జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులను రఘువీరా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి రఘువీరారెడ్డితో చర్చలు జరిపి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో... రఘువీరా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా... ఇస్తే ఏ పార్టీలోకి వెళతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Tags
సంబంధిత వార్తలు
Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు
CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు జారీ
Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు
Palnadu Road Accident: పల్నాడులో ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవ దహనం, ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వస్తుండగా విషాదం
Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నికల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నికల సంఘం
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)