Pawan Kalyan Campaign: ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌కు పోలీసుల బ్రేక్, ఎన్నిక‌ల సంఘం ద‌గ్గర అనుమ‌తి లేదంటూ నిలిపివేత‌

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే, వారాహిపై (Vaarahi) ప్రచారానికి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. వారాహి వాహనం ఏపీ వ్యాప్తంగా తిరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (EC) దగ్గర అనుమతులు తీసుకోవాలని అన్నారు.

Varahi bus for Pawan Kalyan (Photo-Twitter/Pawan)

Vijayawada, March 31: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే, వారాహిపై (Vaarahi) ప్రచారానికి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. వారాహి వాహనం ఏపీ వ్యాప్తంగా తిరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (EC) దగ్గర అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు వారాహిపై ప్రచారానికి జనసేన అనుమతులు తీసుకోలేదన్నారు. చేబ్రోలు జనసేన బహిరంగ సభకు మాత్రం పోలీసులు అనుమతులిచ్చారు. వారాహి స్థానంలో జనసేన నేతలు మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, పిఠాపురం వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ టీడీపీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.

AP CM YS Jagan Bus Yatra: విజయవంతంగా నాలుగో రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ...సీఎం జగన్ తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తుగ్గులి, రాతన గ్రామ ప్రజలు 

పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచారానికి ప్రారంభిస్తున్నారు. వారాహికి (Vaarahi అనుమతి నిరాకరించడంతో పవన్ కల్యాణ్ రోడ్ షో లేకుండానే హోటల్ నుంచి చేబ్రోలులో వెళ్లనున్నారు. ఆయన అక్కడ ఐసర్ వాహనంపై ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

PMGKAY: ఉచిత రేషన్‌ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్‌ ప్లాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్లకు రేషన్ కట్ చేసేందుకు సన్నాహాలు

Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Janasena: జనసేనకు గుడ్ న్యూస్‌..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ

Share Now