Visakha: ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు!

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Vishaka(X)

Vishakhapatnam, Jul 21:  ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో వైసీపీకి మేయర్ పీఠం చేజారనుంది. కీలకమైన విశాఖ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ ,జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఇవాళ వైసీపీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్ద ఎత్తున కార్పొరేటర్లు పార్టీ మారడంతో మేయర్ పీఠం కూటమి వశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇక కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 23న లేదా 24న జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో 98 వార్డులుండగా 2021 ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది. ఇక టీడీపీ 30 వార్డులు గెలుచుకోగా జనసేన మూడు,సీపీఎం,సీపీఐ,బీజేపీ చేరో స్థానంలో గెలిచాయి. నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందగా వారు వైసీపీకి మద్దతిచ్చారు. ఇక ప్రస్తుతం అధికారం టీడీపీ కూటమి వశం కావడంతో ఆపరేషన్ విశాఖ కార్పొరేషన్ చేపట్టారు కూటమి నేతలు. ఇందులో భాగంగా తొలుత 14 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరగా మరికొంతమంది జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. చాపకిందనీరులా విస్తరిస్తున్న చండీపురా వైరస్, గుజరాత్‌లోనే 16 మంది మృతి, నిర్లక్ష్యం చేస్తే అంతే!

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

Share Now