AP FiberNet Scam: ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి, రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు విచారణ వాయిదా

ఏపీ పైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

Chandrababu Naidu,File Image. (Photo Credit: ANI)

Chandrababu Case Updates: ఏపీ పైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో వివిధ ఆస్తులు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.మొత్తం రూ.114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్‌ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది.

చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వెల్లడి

నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్‌లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

ఆస్తుల వివరాలు ఇవి

1. తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు

2. నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. మొత్తంగా అటాచ్‌ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి.

3. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.

ఇక మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ‘‘మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రివిలేజ్‌ ఫీజు కూడా నిబందనల మేరకే తీసుకున్నారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారు’’ అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ తరఫు న్యాయవాది బుధవారం వాదనలు వినిపించనున్నారు.

 స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఊరట, రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు ఎలా సాగాయంటే..

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జడ్జిలను దూషించారంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.కాగా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు(Chandrababu) సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి విదితమే.

చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు టీడీపీ ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ (సీఐడీ) వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. అందుకే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీనిపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now