EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం

CEO Mukesh Kumar Meena (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు.

పోలింగ్ నాడు మాచ‌ర్ల‌లో ఇలాంటివి 7 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డించారు. అందులో కొంద‌రు ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన‌ట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామ‌ని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌ల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు.  మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

20వ తేదీన రెంట‌చింత‌ల ఎస్ఐ కోర్టులో మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్ని రామ‌కృష్ణారెడ్డిని ఎస్ఐ పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్నిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి.

ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం’’ అని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

PM Modi Takes Holy Dip at Triveni Sangam: వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Telangana Caste Census: : వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

Share Now