AP Coronavirus: ఏపీలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వార్తలు, అప్రమత్తమైన ఏపీ సర్కారు, వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచన

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయింది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న సంధర్భంగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష (AP Ministers Alla Nani And Buggana Rajendra corona Review) నిర్వహించారు.

AP Health Minister Alla Nani (Photo-Video Grab)

Amaravati, Mar 23: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయింది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న సంధర్భంగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష (AP Ministers Alla Nani And Buggana Rajendra corona Review) నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ( Alla Nani) మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ సాగుతోంది. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కరోనా సోకిన 163 మంది విద్యార్థులను రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వైద్య సదుపాయం కల్పించాము. కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎమ్‌హోచ్‌ఓ డాక్టర్ గౌరిశ్వరావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని తెలిపారు.

రాజమండ్రిలో కరోనా కల్లోలం, ఒకే కాలేజీలో 163 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 310 మందికి పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు, 7,191కి చేరిన కరోనా మృతుల సంఖ్య

కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా డీఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ గౌరిశ్వరరావును ఆదేశించాము. అంతేకాక తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్‌కి తరలించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని ఆళ్ల నాని తెలిపారు

కాగా కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులను 24 గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35 కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశాము.

ఆగని కరోనా కల్లోలం, ఒక్కరోజే 199 మంది మృత్యువాత, గత 24 గంటల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ, 1,16,86,796కు చేరుకున్న మొత్తం కరోనా కేసుల సంఖ్య, 1,60,166కు చేరుకున్న మృతుల సంఖ్య

తిరుమల జూనియర్ కాలేజీ లో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని మంత్రి ఆళ్ల నాని కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Share Now