Nellore Shocker: రౌడీగా మారిన కొడుకు..తట్టుకోలేక కర్రతో కొట్టి చంపేసిన తండ్రి, నెల్లూరు జిల్లాలో ఘటన, అనంతపురం జిల్లాలో ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ డాక్టర్

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు (Nellore Shocker) గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు.

Representational Image | (Photo Credits: PTI)

Nellore, Sep 13: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు (Nellore Shocker) గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు. తీరు మార్చుకోమని చెప్పిన తండ్రిపై నిన్న రాత్రి దాడి చేయడంతో.. విసిగిపోయిన తండ్రి పెంచలయ్య.. మమకారాన్ని చంపుకొని కర్రతో కసిగా తలపై కొట్టి.. కుమారుడిని (Rowdy sheeter killed by His Father) హతమార్చాడు. హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక అనంతపురం జిల్లా గుంతకల్ లో ఒంటరితనం భరించలేక ఆర్మీ డాక్టర్‌ ఆత్మహత్య (Army Doctor Suicide) చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్‌ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్‌ వర్ధన్‌ (33)కర్నూలు మెడికల్‌ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్‌లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్‌ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.

నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి, లేదంటే నా కాపురం కూలిపోయేలా ఉంది, హర్ష్ గోయెంకాకు లేఖ రాసిన ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ ఉద్యోగి భార్య, ట్విట్టర్లో వైరల్ అవుతున్న గోయెంకా ట్వీట్

ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్‌ వర్ధన్‌ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు.

కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్‌ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ పద్మావతి తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now