CM KCR Press Meet: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ , యాసంగిలో కొనుగోలు కేంద్రాలు లేవు, 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ...సీఎం కేసీఆర్ ఫైర్

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 750 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న బీజేపీ రైతు హంత‌కుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.

CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Nov 29: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కొనబోమని పూర్తిస్ధాయిలో కేంద్రం తేల్చిచెప్పిందని, రాష్ట్రం కూడా వరి ధాన్యం సేకరణ చేపట్టదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని తేల్చిచెప్పారు. రైతులకు క్లియర్‌గా చెబుతున్నానని, కేంద్రం చేతులెత్తిసింది కాబట్టి  యాసంగి పంటకు ఎట్టిపరిస్ధితుల్లోనూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. వర్షాకాలం పంట ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాకాలం పంటకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం.. రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తోంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 750 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న బీజేపీ రైతు హంత‌కుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. మీది రైతు రాబందు పార్టీ. వాస్త‌వం కాదా.. 750 మంది చ‌చ్చిపోలేదా. 13 నెల‌లు వాళ్లు ఎండ‌న‌కా.. వాన‌న‌కా.. క‌రోనాలో నిర‌స‌న‌ చేస్తే.. అప్పుడు ప‌ట్టించుకోకుండా.. ఇప్పుడు మాట్లాడుతున్నారా? మేము రైతు బంధువులం.

మేము ప్రాజెక్టులు క‌ట్టాం. ఎల్లంప‌ల్లి, మిడ్ మానేరు, నెట్టెంపాడు, క‌ల్వ‌కుర్తి, భీమా, కోయిల‌సాగ‌ర్, దేవాదుల‌ ప్రాజెక్టులు ఎవ‌రు కంప్లీట్ చేశారు. అంత‌కుముందు ఈ ప్రాజెక్టుల‌న్నీ ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్లు ముంచేవాళ్లు త‌ప్పితే మంచి చేసేవాళ్లు కాదు. తెలిపోయింది. ఇది 100 శాతం రైతు వ్య‌తిరేక పార్టీ.. అని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు.

తెలంగాణలో ఒమిక్రాన్  వైరస్ అలర్ట్, ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన ప్రజారోగ్య సంచాలకుడు, డెల్టా కంటే ఒమిక్రాన్ 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెదుతుందని వెల్లడి

దేశంలో ఆహార ధాన్యాల‌ను సేక‌రించ‌డం.. సేక‌రించిన ధాన్యాన్ని ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా పేద‌ల‌కు అందించ‌డం.. అలాగే దేశ ఆహార భ‌ద్ర‌త కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్ నిలువ చేయ‌డం సేక‌రించిన ధాన్యంలో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి ఆహార కొర‌త ఏర్ప‌డ‌కుండా.. ఆహార ర‌క్ష‌ణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ త‌ర్వాత‌ ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు ఆహార ధాన్యాల‌ను అందించి నిరుపేద‌ల‌కు అందించ‌డం.. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బ‌ద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్య‌త‌ అని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున, రైతుల త‌రుపున‌.. మంత్రులు, ఎంపీలు, సీఎస్‌ వెళ్తే మీకు వేరే ప‌నిలేదా.. అని కేంద్ర మంత్రి అన్నారు. ప‌చ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మంత్రుల‌కు ప‌నిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్ర మంత్రి మాట్లాడేది. రైతుల జీవితాల‌తో ఇలాగేనా చెల‌గాటం ఆడేది. తెలంగాణ రైతుల‌ను ముంచ‌డానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్త‌డు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలె రైతులు. బీజేపీ క‌న్నా తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రెట్లు మెరుగ్గా ఉంది. తెలంగాణ‌లో అత్య‌ధిక పంట పండిస్తున్నందుకు మీరు ఓర్వ‌డం లేదు.. అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Petition Filed In High Court Against KCR: కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని అభ్యర్ధన

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Share Now