Fine Rice For Ration Card Holders: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! జనవరి నెల నుంచి ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం, ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేషన్ కార్డు దారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.
Hyderabad, AUG 22: ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం (Ration Card Holders) ఇస్తామన్నారు. పీడీఎస్ (PDS Rice) బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. బియ్యం తరలిస్తూ పట్టుబడితే డీలర్ షిప్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వారి న్యాయమైన కోర్కెల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మహాలక్ష్మి పధకం లబ్ధిదారులకు చేరుతున్న సబ్సిడీ విషయం లబ్ధిదారులకు చేరవేయాలన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement