KCR Letter to PM Modi: ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు లేఖ, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్, రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపాటు

ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్(Kcr Letter to Modi). ఎరువుల ధరల పెంపుపై కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు (KCR opposes hike in fertilizer rates). పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కోరారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు(fertilizer prices) త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞప్తి చేస్తున్నాన‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Telangana CM KCR | Photo: CMO

Hyderabad January 13: ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్(KCR Letter to Modi). ఎరువుల ధరల పెంపుపై కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు (KCR opposes hike in fertilizer rates). పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కోరారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు(fertilizer prices) త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞప్తి చేస్తున్నాన‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని కేంద్రం 2016లో ప్రక‌టించారు. ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

రైతాంగం ఇప్పటికే తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr). ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం పెరిగాయి. గ‌త 90 రోజులుగా ఎరువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవ‌సాయాన్ని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గ‌త ఐదేండ్లలో ఇన్‌పుట్ కాస్ట్(Input Cost) రెట్టింపు అయింద‌న్నారు. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధ‌ర‌ల‌ను(fertilizer prices) పెంచుతోంది. యూరియా, డీఏపీ వినియోగం త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌కు చెబుతున్నారు. ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోగా, ఆ భారాన్ని రైతుల‌పై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల ప‌క్షాన చెబుతున్నా.. ఎరువులు స‌బ్సిడీ(Subsidy on fertilizers)పై ఇవ్వాలి. రైతుల పెట్టుబ‌డి మొత్తాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం కేసీఆర్.

Tejaswi Yadav Meets CM KCR: జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు, బీహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌‌తో ప్రగతి భవన్‌లో భేటీ

కేంద్రం చ‌ర్యల‌తో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎరువుల స‌బ్సిడీ విధానాన్ని రైతుల ప్రయోజ‌నాల‌కు విరుద్ధంగా మార్చారు. 70 ఏండ్లుగా ఎరువుల‌పై స‌బ్సిడీ కొన‌సాగుతోంది. న‌రేగాతో వ్యవ‌సాయాన్ని అనుసంధానం చేయాల‌ని తెలంగాణ తీర్మానం చేసి పంపింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement