KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.
Hyderabad, FEB 05: పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికైనా కనికరం లేని కాంగ్రెస్ (Congress) సర్కారు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. తమ పదవీకాలంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన తాజా మాజీ సర్పంచ్లకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నిలదీశారు.
మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నట్లుగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని.. బడా కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లకు కమీషన్ల పేరుతో నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు సర్పంచుల నుంచి కమీషన్లు రావన్న ఒకే ఒక్క కారణంతో వారి బిల్లులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాజకీయ పరమైన వివక్షకు తావులేకుండా గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడిన సర్పంచుల డిమాండ్ మేరకు బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)