Lingojiguda Division Bypoll Result: లింగోజిగూడలో బీజేపీకి పరాభవం, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం, తాజా విజయంతో బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
Hyderabad, May 3: జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఫలితం (Lingojiguda Division Bypoll Result) వెలువడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందాడు. బీజేపీ అభ్యర్థి మందుగుల అఖిల్ గౌడ్ గెలుస్తాడని భావించినప్పటికీ, ఆ పార్టీకి షాక్ తగిలింది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది.
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో మొత్తం 13,629 ఓట్లు పోలవ్వగా, 13,340 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 7,240 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 5,968 ఓట్లు రాగా, నోటాకు 101 ఓట్లు వచ్చాయి. 188 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్, జల్ల నాగార్జున, షేక్ ఫర్వేజ్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
Tags
సంబంధిత వార్తలు
Arvind Kejriwal Challenges PM Modi: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్, రేపు బీజేపీ ఆఫీస్ కు వస్తా మీ ఇష్టం వచ్చినవాళ్లను అరెస్ట్ చేసుకోండి
Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్లపై పలు డిమాండ్లు..లేకపోతే ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతామంటూ హెచ్చరిక
Lok Sabha Election 2024 Result Prediction: బీజేపీ 400 సీట్ల మార్క్ దాటుతుందా ? కాంగ్రెస్ పుంజుకుంటుందా, ఫలోడి సత్తా మార్కెట్ లేటేస్ట్ అంచనాలు ఇవిగో..
Sushil Kumar Modi No More: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత.. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సుశీల్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైందని తెలిపిన అధికారులు
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్లో పాల్గొనాలని పిలుపు
PM Modi in Hyderabad: యూపీఏ హయాంలో హైదరాబాద్ లో ఎన్ని పేలుళ్లు జరిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ప్రధాని మోదీ
Navneet Rana '15 Seconds' Remarks: బీజేపీ ఎంపీ నవనీత్ రానా 15 సెకన్ల వ్యాఖ్యల దుమారం, వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)