Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే అవకాశం, కవితకు ఈడీ నోటీసులపై కేబినెట్‌లో చర్చించే ఛాన్స్‌, పెన్షన్లు, జీతాల పెంపుపై ప్రధానంగా చర్చ

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meet) కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటూ పెన్షన్లు, జీతాల పెంపుపై కేబినెట్ (Telangana Cabinet Meet) చర్చించనుంది. అనంతరం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కేబినెట్ ఫైనల్ చేయనుంది.

Telangana Cabinet Meet | File Photo

Hyderabad, March 09:  ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meet) కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటూ పెన్షన్లు, జీతాల పెంపుపై కేబినెట్ (Telangana Cabinet Meet) చర్చించనుంది. అనంతరం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కేబినెట్ ఫైనల్ చేయనుంది. వాటిని గవర్నర్ కు పంపించనుంది. మరోవైపు శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్త సంయుక్త సమావేశం జరుగబోతుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.

YS Sharmila Arrest: కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మౌన దీక్ష, షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు, బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఆరోపణలు  

కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులతో కేబినెట్, బీఆర్ఎస్ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కూడా జరుగబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam) ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో మార్చి9న జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.  

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెలాఖరు నాటికి రూ.3 వేల కోట్ల బిల్లులు చెల్లింపు, ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గం చర్చలు  

ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రను ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల జారీ చేయడంపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్‌ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement