Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు
మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
Hyderabad, Mar 12: మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు (Loksabha Elections) ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం (Telangana Cabinet Meeting) కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
భారీ మహిళా సదస్సు
నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)