Telangana: భర్త వేరే మహిళతో..భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, జడ్చర్ల మండలంలో విషాదకర ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.

Representational Image (Photo Credits: ANI)

Hyd, Sep 26: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యకు (Jadcherla Sarpanch commits suicide) పాల్పడింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారానికి చెందిన సిరి (28)కి నసురుల్లాబాద్‌తండా వాసి శ్రీనివాస్‌తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది.

అయినప్పటికీ భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.

బర్త్‌డే పేరుతో మహిళా కానిస్టేబుల్‌పై తెగబడిన కామాంధులు, దారుణంగా అత్యాచారం చేసి వీడియో చిత్రీకరణ, అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి సోదరుడు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఆమె భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement