Mahaboobnagar: సెల్యూట్ సార్.. అనాథ అమ్మాయిని దత్తతకు తీసుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు..

కలెక్టర్‌ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్‌ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు.

Mahabubnagar Collector Venkat Rao (Image: Twitter)

ఆయన ఓ జిల్లా కలెక్టర్. అయినప్పటికీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకొని చలించిపోయి ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు. ఆదివారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.కె జి బి వి లోని విద్యార్థుల చదువు ,భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరవ తరగతి చదువుతున్న వైష్ణవికి తల్లిదండ్రులు లేరని తెలుసుకొని ఆ అమ్మాయి అవ్వ ,తాత ల ను పిలిపించి మాట్లాడి వైష్ణవిని తాను దత్తత తీసుకుంటున్నానని ఇకపై వైష్ణవి బాగోగులు తానే చూసుకుంటానని,వైష్ణవి ఎంత చదివితే అంత వరకు చదివిస్తానని హామీ ఇచ్చి అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

ఈ సందర్భంగా వైష్ణవి తాను పోలీస్ అవ్వాలనిఆనుకుంటున్నానని తెలుపగా చదివిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె జి బి వి పాఠశాలలో విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు.అంతే కాక భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగ ప్రస్తుతం ఉన్న పాఠశాలలో వసతి సౌకర్యం ఇబ్బందిగా ఉందని తెలపగా, 15 రోజుల్లో నూతన భవనంలోకి వెళ్లాలని, ఇందుకుగాను భవనాన్నీ హ్యాండోవర్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు భోజనాన్ని నాణ్యతగా అందించాలని, అంతేకాక గుణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ మాధవి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Mahaboobnagar: సెల్యూట్ సార్.. అనాథ అమ్మాయిని దత్తతకు తీసుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు..

Corona in Telangana: తెలంగాణలో 50 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1567 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 447కు చేరిన కరోనా మరణాలు

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Advertisement

Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్‌-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Advertisement
Advertisement
Share Now
Advertisement