Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.

Telangana Special Assembly sessions likely to be held for 5 days!(X)

Hyd, Feb 20:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత మార్చి 10 వ తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుంది.

మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశం జరుగనుండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి(Telangana Assembly) వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. మార్చి 31వ తేదీలోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.

మిస్‌ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్‌, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను రూపొందించే పనిలో ఉంది. ఎస్సీ ఉప వర్గీకరణకు(Telangana Assembly) చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై ఒక బిల్లు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా మరో బిల్లు.. ఇలా మూడు బిల్లులను ప్రభుత్వం సిద్దం చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది బీఆర్ఎస్. రైతు, గురుకులాల సమస్యలతో పాటు కులగణన తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Share Now