Robbers Attack: తెలుగువారిపై మహారాష్ట్రలో దొంగలు దాడి, షిర్డీ నుంచి వస్తుండగా కత్తులతో అడ్డగించిన దొంగల గుంపు, 8 తులాల బంగారం అపహరణ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు.

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, Feb 13: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు. షిర్డీ దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడి అందినకాడికి సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీ పోలీస్ స్టేషన్ (Vasi police station) పరిధిలో చోటుచేసుకుంది. గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటన వివరాల్లోకెళితే.. వికారాబాద్‌ జిల్లా ( Vikarabad District) బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి రెండు గంటలకు వాసీ సమీపంలో దొంగలు రోడ్డుపై మేకులు వేయడంతో కారు పంక్చర్ అయి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో రాములు కుటుంబంపై దాడి చేసి దొంగలు బంగారం, నగదు దోచుకు వెళ్ళారు. ప్రస్తుతం హుమ్నాబాద్ లోని ఓ ఆస్పత్రిలో వీరికి చికిత్స జరుగుతోంది.

జీఎన్ సాయిబాబాకు కరోనావైరస్ పాజిటివ్, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు, వైద్యుల నిర్ణయం తరువాత ఇతర విషయాలు వెల్లడిస్తామని తెలిపిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్‌ కుమార్‌ కుమ్రే

కాగా చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా క‌త్తులు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరి వ‌ద్ద నుంచి 8 తులాల బంగారు న‌గల‌ను దొంగ‌లు అప‌హ‌రించుకుపోయారు. మహారాష్ట్ర వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు

Maha Kumbh Mela 2025: దారుణం, కుంభమేళాలో స్నానం చేసిన మహిళల వీడియోలు అమ్మకానికి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు, మెటా సాయం కోరిన అధికారులు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Share Now