TS MLC Election 2021: ముగిసిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్, భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ (TS MLC Election 2021 Polling) సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
Hyd, Dec 10: తెలంగాణ రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ (TS MLC Election 2021 Polling) సాయంత్రం 4 గంటలకు ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు. 5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా, నాలుగు ఓట్లు తప్ప మిగతావి అన్నీ పోలయ్యాయి.
మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు. 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నంకల్లా ఫలితాలు (TS MLC Election 2021 Results) వెలువడనున్నాయి. లోకల్బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)