Amit Shah Telangana Tour Cancelled: మ‌రోసారి ర‌ద్ద‌యిన అమిత్ షా టూర్, తెలంగాణ‌లో రేపు జ‌రగాల్సిన ప‌ర్య‌ట‌న వాయిదా, కార‌ణం ఏంటంటే?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన (Amit Shah Telangana Tour) రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు.

G Kishan Reddy and Amit Shah. (Photo Credits: ANI)

New Delhi, JAN 27: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన (Amit Shah Telangana Tour) రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్‌ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తున్నది.

KTR Traveling in an Auto: ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్.. వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..(Viral Video) 

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు వస్తారని.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే అమిత్‌ షాను బిహార్‌ లోక్‌జనశక్తి (రాంవిలాస్‌) పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షా పర్యటన రద్దయ్యిందని, త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement