Airtel Free Data Offer: ఎయిర్టెల్ ఉచిత డేటా ఆఫర్, ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటా ఉచితం, ఆఫర్ వివరాలు ఓ సారి తెలుసుకోండి
ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది.
ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ తాజాగా గుడ్న్యూస్ (Airtel Free Data Offer) చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది. రూ. 265, రూ. 299, రూ.719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవల ప్రీపెయిడ్ ప్యాక్ ధరలను పెంచిన ఎయిర్టెల్ మరింత టాక్టైమ్, మరింత డేటా అందిస్తామని అప్పట్లో పేర్కొంది.
ఇటీవల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్తో పాటు డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్ టారిఫ్ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్టెల్ తాజాగా ప్రకటించిన ఆఫర్ అన్ని ప్లాన్లకు వర్తించదు.
రూ. 265 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా 28 రోజులపాటు లభిస్తుండగా, రూ. 839 ప్లాన్లో 84 రోజుల కాలపరిమితితో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ప్రతి రోజు అదనంగా 500 ఎంబీ డేటా లభిస్తుంది.
అదనపు డేటా ఆఫర్ ప్లాన్ కాలపరిమితి ఉన్నంత వరకే ఉంటుంది. ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ ఆఫర్ కూడా ముగిసిపోతుంది. అదనపు డేటాకు రోల్ ఓవర్ సౌలభ్యం ఉండదని ఎయిర్టెల్ తెలిపింది. కాగా, ఈ అదనపు డేటా ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే వివరాలను మాత్రం ఎయిర్టెల్ వెల్లడించలేదు.
ఎయిర్ టెల్ పెంచిన ధరలు
♦ఎయిర్ టెల్ పెంచిన రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు రూ. 99కి చేరింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్టైమ్, 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది.
♦ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెంచింది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారింది. .
♦ డేటా టాప్ అప్ రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారింది.
♦ రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) కి చేరింది.
Tags
సంబంధిత వార్తలు
Free Netflix on Airtel Plans: యూజర్లకు ఉచిత నెట్ఫ్లిక్స్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్టెల్, అయితే ఈ మూడు ప్లాన్లలో ఉన్నవారికి మాత్రమే ఆఫర్
Liquor Prices Hike: ఈ మూడు రాష్ట్రాల్లో మందుబాబులకు షాక్, భారీగా పెరిగిన మద్యం ధరలు, నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి..
Contactless Payments Via Smartwatch: ఇకపై ఫోన్ అవసరం లేకుండా మీ స్మార్ట్వాచ్ ద్వారా చెల్లింపులు జరపండి, నాయిస్తో కలిసి సరికొత్త వాచ్ లాంచ్ చేసిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
Gold Price: రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధర, 10 గ్రాముల గోల్డ్ ఏకంగా రూ. 66వేలు, మరింత పెరిగే అవకాశముందంటున్న నిపుణులు
Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్దీప్ సింగ్ పూరీ ప్రకటన
Liquor Prices In Karnataka: మందుబాబులకు షాక్! త్వరలో భారీగా పెరుగనున్న మద్యం ధరలు, ముఖ్యంగా బీర్ రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం
Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల
Cable TV Prices Hike: కేబుల్ టీవీ వినియోగదారులకు బిగ్ షాక్, భారీగా పెరుగనున్న చార్జీలు, నెలవారీ టీవీ బిల్లులు పెంచుతూ పలు సంస్థల ప్రకటన
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)