Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.

Missile. Representational Image (Photo Credits: Twitter)

Balasore, Dec 22: చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం (APJ Abdul Kalam Island) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిప‌ణి ఒక టన్ను వరకు వార్‌హెడ్‌ని మోసుకెళ్లగలదు.

ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లంలోని ల‌క్ష్యాల‌ను చేధించే సామ‌ర్థ్యంగ‌ల బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌ళ‌య్‌ని (Pralay Missile) భార‌త్ విజ‌య‌వంతంగా ప‌్రయోగించిందని.. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) అధికారులు ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణి ఘన ఇంధ‌నంతో ప‌నిచేస్తుంది. ఇండియ‌న్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన‌ పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని రూపొందించారు.

గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీజే అబ్దుల్ క‌లాం ఐలాండ్ నుంచి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించారు. కాగా, క్షిప‌ణి ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన డీఆర్‌డీవో బృందాన్ని ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పారదర్శకంగా కాంగ్రెస్ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తేవాలని డిమాండ్

Advertisement
Advertisement
Share Now
Advertisement