Tech Layoffs: కొనసాగుతున్న భారత ఐటీ రంగం సంక్షోభం, ఆరు నెలల్లో 51 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన కంపెనీలు, ఇంతలా తొలగింపులు ఎందుకు జరుగుతున్నాయి

గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారతీయ ఐటీ పరిశ్రమ (IT Sector) సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి రోడ్డు మీద పడ్డారు. భారతదేశంలోని టాప్​ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్​ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారతీయ ఐటీ పరిశ్రమ (IT Sector) సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి రోడ్డు మీద పడ్డారు. భారతదేశంలోని టాప్​ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్​ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఐటీ కంపెనీలు దాదాపు 51,744 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.

గ్రిగేటర్ ప్లాట్​ఫాం స్టాటిస్టా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో టాప్​ 9 ఐటీ కంపెనీలు (Top IT Companies In India) అయిన.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​, ఇన్ఫోసిస్​, విప్రో, హెచ్​పీసీఎల్​ టెక్​, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్​, ఎంఫసిస్​, పెర్సిస్టెంట్ సిస్టమ్స్​, ఎల్​టీఐమైండ్​ట్రీలు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం మధ్య తమ ఉద్యోగులను భారీ స్థాయిలో తగ్గించుకున్నాయి.ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ మాత్రమే కొత్తగా ఉద్యోగులను కంపెనీలోకి తీసుకుంది. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ 32 మందినే ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఉద్యోగాల్లోకి తీసుకున్నది. అయితే సంస్థ ఉద్యోగుల సంఖ్య ఎప్పుడూ లేనివిధంగా 22,265కి చేరింది.

ఐటీ జాబ్ ఇంటర్యూ కోసం నిరుద్యోగులు వేలల్లో ఎలా తరలివచ్చారో వీడియోలో చూడండి, 6 నెలల్లోనే 52వేల ఉద్యోగాలు ఔట్

విప్రో, టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్ వంటి భారతదేశంలోని కొన్ని ప్రధాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తొలగించాయని ఎసెంట్ నివేదికలు సూచిస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు కూడా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కోవిడ్-19 మహమ్మారితో నడిచే అన్ని డిజిటల్ వస్తువులకు డిమాండ్ పెరగడంతో ఈ సంక్షోభం ఎదురయింది.

భారీ తొలగింపులు తరచుగా కార్యాచరణ సామర్థ్యం ఆధారంగా సమర్థించబడతాయి. అయినప్పటికీ, అవి గణనీయమైన సామాజిక ఖర్చులతో వస్తాయి. వీటిలో వ్యాపార (డౌన్) చక్రాలను పెంచడం, మార్కెట్ సెంటిమెంట్‌లను దెబ్బతీయడం వంటివి ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కూడా ఓ కారణమే..

ఆర్థిక మాంద్యం సమయంలో భారీ తొలగింపులు రద్దీగా ఉండే జాబ్ మార్కెట్‌ను సృష్టించగలవు, ప్రత్యేకించి IT వంటి ప్రత్యేక రంగాలలో వ్యక్తులకు పని దొరకడం కష్టమవుతుంది. మరొక సవాలు ఏమిటంటే కంపెనీలు భారీ తొలగింపుల తర్వాత మూలధనం మరియు శ్రమను తిరిగి సమతుల్యం చేస్తాయి. సమకాలీన ఆర్థిక ధోరణులు ఉత్పత్తి ప్రక్రియల్లో మూలధనం వాటా లౌకికంగా పెరుగుతోందని సూచిస్తున్నాయి.

లేఆప్స్‌పై షాకింగ్ న్యూస్, గంటకు 23 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ కంపెనీలు, ఇప్పటి వరకు 4,04,962 మంది రోడ్డు మీదకు..

భారతదేశం యొక్క GDPకి భారతదేశ IT పరిశ్రమ యొక్క సాపేక్ష వాటా 7.5 శాతం, మరియు ఇది దాదాపు 5.4 మిలియన్ల మంది నిపుణులను నియమించింది. ఈ పరిశ్రమలో ఇటీవలి తొలగింపులతో ముడిపడి ఉన్న అధిక సామాజిక వ్యయాలకు ప్రభుత్వ శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఐరోపా తదితర గ్లోబల్‌ మార్కెట్లలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం.. దేశీయ ఐటీ కంపెనీలను భారీగానే ప్రభావితం చేస్తున్నాయి.

ఇన్ఫోసిస్​ సీఎఫ్​ఓ నీలాంజన్​ రాయ్​.. ఇటీవలే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు.విప్రో సీహెచ్​ఆర్​ఓ సౌరభ్​ గోవిల్​.. తాము ముందుగా ఆన్​బోర్డింగ్​ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆ తరువాతనే కొత్త నియామకాల గురించి ఆలోచిస్తామని ఇటీవల తేల్చిచెప్పారు. టీసీఎస్​ సీఈఓ కె.కృతివాసన్​.. ప్రస్తుతం ఐటీ రంగానికి బాగా డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చక్కబడే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మరలా ఐటీ పరిశ్రమ పుంజుకుంటుందని.. అప్పుడు కచ్చితంగా కొత్త ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ సెప్టెంబర్‌ 30 నాటికి ఏ సంస్థలో ఎంతమంది?

సంస్థ : ఉద్యోగులు

టీసీఎస్‌ : 6,06,985 (గతంలో 6,16, 171)

కాగ్నిజెంట్‌ : 3,45,600 (గతంలో 3,55,300)

ఇన్ఫోసిస్‌ : 3,28,764 (గతంలో 3,46,845)

విప్రో : 2,44,707 (గతంలో 2,62,626)

హెచ్‌సీఎల్‌ టెక్‌ : 2,21,139 (గతంలో 2,25,944)

టెక్‌ మహీంద్రా : 1,50,604 (గతంలో 1,63,912)

ఎల్‌టీఐమైండ్‌ట్రీ : 85,532 (గతంలో 86,936)

ఎంఫసిస్‌ : 33,771 (గతంలో 36,899)

పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ : 22,842 (గతంలో 22,889)

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ : 22,265 (గతంలో 22,265)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement