Pakistan Shocker: ఆస్పత్రి పైకప్పుపై వందలాది కుళ్లిపోయిన శవాలు, కొన్నింటికి గుండె, కళ్లు, లివర్ లేకపోవడంతో అనుమానాలు, పాకిస్థాన్‌ లో బయటపడ్డ శవాల గుట్టపై విచారణ ప్రారంభం, శవాలు ఎవరివో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి

ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఆందోళన కరమైన ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఇలాహీ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

Representational Image (Photo Credits: Pixabay)

Islamabad, OCT 15: పాకిస్థాన్‌లో (Pakistan) అత్యంత దారుణమైన, ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలను కనుగొన్నారు! ఈ మృతదేహాలు కుళ్లిపోయిన దశలో (decomposing corpses) ఉన్నాయి..!! శరీరభాగాలు లేకుండా అత్యంత భయానక స్థితిలో ఉన్నాయి..!!ఈ విషయమై నిష్తార్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఓ సెక్షన్ అధికారి లేఖ రాశారు. శుక్రవారం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని () ప్రభుత్వ రంగం ఆస్పత్రి (Nishtar Hospital) అయని నిష్టర్ ఆసుపత్రిలో పైకప్పుపై కుళ్లిపోయిన మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. వెలుగులోకి వచ్చిన మృతదేహాలలో చాలా భాగాలు కూడా కనిపించలేదు. చాలా మృతదేహాలు ఛిద్రం అయిపోయి ఉండగా..మరికొన్ని మృతదేహాల నుంచి ఛాతీలు బయటపడ్డాయి. మృత దేహాల (bodies) నుంచి గుండె, ఇతర అవయవాలు బయటకు వచ్చి కనిపించి బీతావహంగా ఉన్నాయి. ఆసుపత్రి పైకప్పు నుండి బయటపడిన మృతదేహాల సంఖ్య 500 వరకు ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Pakistan: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న రన్నింగ్ బస్సు, 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో పది మందికి తీవ్ర గాయాలు 

ఈ ఘటనపై స్థానికులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మృతదేహాలు ఎవరివి? ఆసుపత్రి పైకప్పుపై ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలు ఎక్కడ నుండి వచ్చాయి? వంటి అనేక అనుమాలు కలుగుతున్న క్రమంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.కాగా..ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని అనుమానాలు వస్తుండగా అదేసమయంలో వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Coronavirus in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, స్కూళ్లు, సినిమా హాల్స్‌,బార్లు,జిమ్‌లు మూసివేత, షాంఘైలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు 

ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఆందోళన కరమైన ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఇలాహీ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. స్పెషలైజ్డ్ హెల్త్‌కేర్ సెక్రటరీ ముజామిల్ బషీర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ విచారణను పూర్తి చేయడానికి ఏర్పాటు చేసింది. సాథ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా మృతదేహాలకు సంబంధించి దుస్తులు పెద్ద సైజులో ఉండటాన్ని (పెద్ద సైజు ప్యాంటు)బట్టి.. మృతులు బలూచ్ కమ్యూనిటీకి చెందినట్లు అనుమానిస్తున్నారు. అయితే స్పష్టమైన సమాచారం కోసం అధికారాలు రంగంలోకి దిగారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now