Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో కో ఎడ్యుకేషన్ రద్దు చేసిన తాలిబన్లు, అబ్బాయిల క్లాసులో అమ్మాయిలు ఉండకూడదని ఆంక్షలు, పశువులతో కామవాంఛ తీర్చుకోవాలన్న తాలిబన్లు, వేశ్యా గృహాల్లో స్త్రీల స్థానంలో జంతువులు, మండిపడుతున్న జంతు పరిరక్షణ సంఘాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ అధికారులు బాలికలు ఇకపై అబ్బాయిలతో ఒకే తరగతిలో కూర్చోవడానికి అనుమతించరాదని (Taliban Ban Mixed-Sex Education in Herat) ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు ఖామా న్యూస్ నివేదించింది.

Taliban Forces | (Photo Credits: Getty images)

Kabul, August 21: ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ అధికారులు బాలికలు ఇకపై అబ్బాయిలతో ఒకే తరగతిలో కూర్చోవడానికి అనుమతించరాదని (Taliban Ban Mixed-Sex Education in Herat) ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు ఖామా న్యూస్ నివేదించింది.

యూనివర్శిటీ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు మరియు తాలిబాన్ అధికారుల మధ్య జరిగిన మూడు గంటల సమావేశంలో, కో-ఎడ్యుకేషన్ కొనసాగించడానికి (Girls No Longer Allowed to Sit in the Same Class With Boys) ప్రత్యామ్నాయం మరియు సమర్థన లేదని, దానిని రద్దు చేయాలని తాలిబన్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కో ఎడ్యుకేషన్ తో పాటు వేరుచేయబడిన తరగతుల మిశ్రమ వ్యవస్థ ఉంది, పాఠశాలలు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాయి. ఆదేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలో సహ విద్య అమలు చేయబడుతుంది.

ఇక 15 ఏళ్లు పైబడిన అమ్మాయిలు, 45 ఏళ్లలోపు వితంతువులు తమ పోరాట యోధులను వివాహం చేసుకోవాలని స్థానిక మత నాయకులను తాలిబాన్ కోరిందని ఖామా న్యూస్ తెలిపింది. హెరాత్ ప్రావిన్స్‌లోని లెక్చరర్లు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు విడివిడిగా తరగతులను నిర్వహించగలవని వాదించారు, కానీ ప్రైవేట్ సంస్థలలో పరిమిత సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉన్నందున, తరువాతి వారు ప్రత్యేక తరగతులను సృష్టించలేరని స్కూలు యాజమాన్యం తెలిపింది.

తాలిబన్లకు దిమ్మతిరిగే షాక్, మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రెబల్‌ ఫోర్స్‌, పోరాటంలో 40 మంది తాలిబన్లు మృతి, పలువురికి గాయాలు

హెరాత్‌లో జరిగిన సమావేశంలో తాలిబాన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఉన్నత విద్యాధిపతి ముల్లా ఫరీద్, సమాజంలోని అన్ని చెడులకు ఈ వ్యవస్థ మూలం కాబట్టి సహ విద్యను రద్దు చేయాలని చెప్పారు. ఫరీద్ ప్రత్యామ్నాయంగా మహిళా లెక్చరర్లు లేదా సద్గుణవంతులైన వృద్ధులు మహిళా విద్యార్థులకు బోధించడానికి అనుమతించబడతారని సహ విద్యకు ప్రత్యామ్నాయం లేదా సమర్థన లేదని అన్నారు. హెరాత్‌లోని లెక్చరర్లు ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక తరగతులను భరించే శక్తి లేనందున వేలాది మంది బాలికలు ఉన్నత విద్యను కోల్పోవచ్చని చెప్పారు. ప్రావిన్స్‌లో ప్రైవేట్ మరియు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలో దాదాపు 40,000 మంది విద్యార్థులు మరియు 2,000 లెక్చరర్లు ఉన్నట్లు సమాచారం.

తాలిబన్ల చెర నుంచి విముక్తి, కాబుల్‌ నుంచి 85 మంది భారతీయులు తరలింపు, భారత వాయుసేన సి-130 జే విమానంలో వారిని తీసుకువస్తున్న అధికారులు, కాబూల్‌లో అడుగుపెట్టిన తాలిబ‌న్ అగ్ర‌నేత ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాదార్

ఇదిలా ఉంటే మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. తాలిబన్లు అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్‌లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్‌లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు.

అఫ్గన్‌లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్‌లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్‌, మజర్‌ ఏ షరీఫ్‌, హెరత్‌, జలాలాబాద్‌, జోవ్జాన్‌ ప్రావిన్స్‌లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్‌ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు.

బయటకొస్తున్న తాలిబన్ల అసలు రూపం, భారత్‌తో సహా పలు దేశాల పౌరులు కిడ్నాప్, కాబూల్‌లోని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యం వ‌ద్ద కిడ్నాప్ కలకలం, 150 మంది కిడ్నాప్ వార్తల‌ను ఖండించిన తాలిబ‌న్ ప్ర‌తినిధి

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్‌ డైరెక్టర్‌ మార్గరేట్‌ స్మిత్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ ఆమె సెటైర్లు పేల్చారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement