Pakistan Road Accident: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

వాయువ్య పాకిస్థాన్‌లో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పర్వత ప్రాంతం నుండి జారిపడి లోయలో పడటంతో కనీసం 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై రావల్పిండి నుండి హుంజాకు బస్సు వెళ్తుండగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు

Pakistan Road Accident (photo-Video Grab)

పెషావర్, మే 3: వాయువ్య పాకిస్థాన్‌లో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పర్వత ప్రాంతం నుండి జారిపడి లోయలో పడటంతో కనీసం 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై రావల్పిండి నుండి హుంజాకు బస్సు వెళ్తుండగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం స్పష్టంగా తెలియరాలేదని అధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చిలాస్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 50 అడుగుల లోతైన లోయలో పడిన ప్రైవేట్ బస్సు, ఆరు మంది అక్కడికక్కడే మృతి

మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్ట్‌గిట్-బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement