Turkey Earthquake: హృదయ విదారకర వీడియో, శిథిలాల కింద చిక్కుకుని యువతి నరకయాత, శరీరం అంతా భూమిలో తల మాత్రమే బయటకు,టర్కీ భూకంపంలో విషాదకర గాథ
టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన వరుస భూకంపాలు (Turkey Earthquake) విలయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ భూకంపంలో శరీరం మొత్తం శిథిలాల కింద చిక్కుకుని ఓ యువతి నరకయాతన (Young Turkish girl pulled out) అనుభవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ankara, February 7: టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన వరుస భూకంపాలు (Turkey Earthquake) విలయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ భూకంపంలో శరీరం మొత్తం శిథిలాల కింద చిక్కుకుని ఓ యువతి నరకయాతన (Young Turkish girl pulled out) అనుభవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టర్కిస్ పారామెడిక్ అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ హృదయ విదారక వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో యువతి ఛాతీ వరకు శిథిలాల కింద ఉంది. తల, భుజాలు, కుడిచేయి మాత్రమే బయటికి కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచి అలాగే ఉండిపోవడంతో యువతి బాగా నీరసించిపోయింది. మాట్లాడే ఓపిక కూడా లేదు. రెస్క్యూ సిబ్బంది మాట్లాడిస్తుంటే ఆ యువతి బలవంతంగా ఓపిక తెచ్చుకుని మాట్లాడుతోంది. ఆమెకు రెస్కూ సిబ్బంది ముందుగా కూల్డ్రింక్ తాగించారు. ఆమెను వెలికి తీసే ప్రయత్నాలు చేస్తూనే స్పృహ కోల్పోకుండా మాట్లాడించారు.
ఈ క్రమంలో ‘దాహంగా ఉందా..?’ అన్న రెస్క్యూవర్ ప్రశ్నకు ఆమె మూలుగుతూ ‘చాలా చల్లగా ఉంది’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ‘నా దేహమంతా మట్టిలో కూరుకుపోయింది’ అని చెప్పింది. దాంతో ‘ఏం పర్లేదు మేం నిన్ను బయటికి తీయబోతున్నాం’ అంటూ రెస్క్యూవర్ ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. కాసేపు ఆగి.. ‘లోపల మా సోదరుడు కూడా ఉన్నాడు’ అని ఆ యువతి చెప్పింది. దాంతో రెస్క్యూవర్ ‘సరే నీతోపాటు అతడిని కూడా బయటికి తీసుకొస్తాం’ అన్నాడు.
ఆ తర్వాత.. ‘మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికీ వెళ్లొద్దు’ అంటూ ఆ యువతి ప్రాధేయపడింది. లేదు లేదు, మేం ఎక్కడికీ వెళ్లం. నువ్వు నీ కాలును కదిలించగలుగుతున్నావా..?’ అని రెస్క్యూవర్ అడిగాడు. అందుకామె బాధతో చిన్నగా ‘లేదు’ అని సమాధానం చెప్పింది. ఈ వీడియో నెటిజన్ల చేత కన్నీటిని పెట్టిస్తోంది.
Here's Videos
కాగా టర్కీ, సిరియాలు సోమవారం వరుస వినాశకరమైన భూకంపాలతో అతలాకుతలమయ్యాయి, ఇది 4,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.6, 6 తీవ్రతతో సంభవించిన రెండు పెద్ద భూకంపాలు భయంకరమైన విధ్వంసానికి దారితీశాయి.పరిస్థితులు చక్కబడిన తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న ప్రియమైన వారిని చేరుకోవాలనే ఆశతో ప్రజలు శిథిలాల గుండా తవ్వుతున్నట్లు సోషల్ మీడియాలో క్లిప్లు చూపించాయి.
గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య వేలాది మంది వీధుల్లోకి పారిపోవడం కనిపించింది.దాదాపు ఒక శతాబ్దంలో టర్కీలో సంభవించిన అతిపెద్ద ప్రకృతి విపత్తుగా నివేదించారు.పరిస్థితిని అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రానున్న రోజుల్లో భూకంపాల మృతుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.భూకంపాల తర్వాత దాదాపు 6,000 భవనాలు కూలిపోయాయని ప్రాథమిక అంచనా.
సోమవారం నాటి భూకంప కేంద్రం ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్లో ఉంది. దాని తర్వాత డజన్ల కొద్దీ అనంతర ప్రకంపనలు, 60 మైళ్ల దూరంలో రెండవ బలమైన భూకంపం సంభవించింది.సిరియాలో, యుద్ధం కారణంగా సంవత్సరాల తరబడి పేదరికంలో ఉన్న ప్రాంతాలు భూకంపాలతో మొత్తంగా శ్మశానాలుగా మారిపోయాయి. లెబనాన్, ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.గడ్డకట్టే పరిస్థితుల్లో కూలిపోయిన భవనాల శిథిలాలను ఛేదించేందుకు రెస్క్యూ టీమ్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)