Paytm Payments Bank: మీ డబ్బు భద్రంగా ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా.. డబ్బులు ఎప్పుడు కావాలన్నా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ

ఆర్బీఐ ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు సదరు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

RBI and Paytm (Photo-File Image)

Newdelhi, Feb 2: ఆర్బీఐ (RBI) ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ (Paytm Payments Bank) కస్టమర్లకు సదరు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 29 తరువాత కస్టమర్లు తమ అకౌంట్లు, వాలెట్లలో డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే, కస్టమర్లు ఎప్పటిలాగే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందని, ఏ సహాయం కావాలన్న తాము 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొంది.

Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..

అసలేం జరిగిందంటే?

పేటీఎం పేమెంట్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. నగదు బదిలీ సేవలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌ ను కూడా నిలిపివేయాలని పేర్కొంది.  ఈ నేపథ్యంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సంస్థ శుక్రవారం పై ప్రకటన చేసింది.

TTD Srivari Hundi: వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 23వ నెలలోనూ రికార్డ్

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now