Acharya Laxmikant Dixit Passes Away: అయోధ్య రాముడు ఆల‌యానికి ముహూర్తం పెట్టిన పూజారి క‌న్నుమూత‌, అయోధ్య బాల‌రాముడికి ప్రాణ‌ప్ర‌తిష్ట చేసింది కూడా ఆయ‌నే..

అయోధ్య‌ రామాలయంలో బాల‌రాముడికి (Ayodhya Ram Lalla) ప్రాణ ప్ర‌తిష్ట చేసిన ప్ర‌ధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్(Acharya Laxmikant Dixit) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వ‌య‌సు 86 ఏళ్లు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న ఆరోగ్యంగా స‌రిగా లేద‌ని కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు

Acharya Laxmikant Dixit Passes Away: అయోధ్య  రాముడు ఆల‌యానికి ముహూర్తం పెట్టిన పూజారి క‌న్నుమూత‌,  అయోధ్య బాల‌రాముడికి ప్రాణ‌ప్ర‌తిష్ట చేసింది కూడా ఆయ‌నే..
Acharya Laxmikant Dixit Passed Away (Photo Credits: x/@PTI_News)

Lucknow, June 22: అయోధ్య‌ రామాలయంలో బాల‌రాముడికి (Ayodhya Ram Lalla) ప్రాణ ప్ర‌తిష్ట చేసిన ప్ర‌ధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్(Acharya Laxmikant Dixit) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వ‌య‌సు 86 ఏళ్లు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న ఆరోగ్యంగా స‌రిగా లేద‌ని కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు. వార‌ణాసిలోని (Varanasi) గాంగా న‌ది తీరంలో ఉన్న మ‌ణిక‌ర్ణిక ఘాట్‌లో ఆయ‌న మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్య‌లో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టించిన విష‌యం తెలిసిందే. ఆ రోజున నిర్వ‌హించిన పూజ‌ల‌కు ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ (Acharya Laxmikant Dixit) నాయ‌కత్వం వ‌హించారు. వార‌ణాసిలో ఉన్న పండితుల్లో లక్ష్మీకాంత్ దీక్షిత్‌ను అగ్ర‌గ‌ణ్యుల‌గా భావిస్తారు.

 

వీరి స్వ‌స్థ‌లం మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లా. కానీ వారి కుటుంబ‌స‌భ్యులు ఎన్నో త‌రాలుగా వార‌ణాసిలోనే నివ‌సిస్తున్నారు. ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ మృతి ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. త‌న ఎక్స్ పోస్టులో ఆయ‌న సంతాపం వ్య‌క్తం చేశారు. ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ కాశీకి చెందిన గొప్ప పండితుడు అని, శ్రీరామ జ‌న్మ‌భూమి ప్రాణ ప్ర‌తిష్ట‌లో ఆయ‌న పాల్గొన్నార‌ని, ఆయ‌న మ‌న‌ల్ని వ‌దిలివెళ్ల‌డం.. ఆధ్యాత్మిక‌, సాహితీ ప్ర‌పంచానికి తీరని లోటు అవుతుంద‌ని సీఎం యోగి పేర్కొన్నారు.

 

సంస్కృత భాష‌కు, భార‌తీయ సంస్కృతికి ఆయ‌న చేసిన సేవ‌ల్ని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటార‌ని సీఎం యోగి త‌న ఎక్స్ పోస్టులో వెల్ల‌డించారు. రాముడి పాదాల వ‌ద్ద ఆయ‌న‌కు చోటు ఇవ్వాల‌ని ఆ దేవున్ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న భ‌క్తుల‌కు, ఫాలోవ‌ర్ల‌కు శ‌క్తిని ఇవ్వాల‌న్ని సీఎం వేడుకున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్‌ లో ఘోరం

AP Full Budget Today: నేడే పూర్తిస్థాయి బ‌డ్జెట్.. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ సర్కారు.. సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో రాష్ట్ర బ‌డ్జెట్

Charminar Bhagyalakshmi Temple: దేవాదాయ శాఖ పరిధిలోకి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అవకతవకలు లేకుండా చూడాలని కోర్టు ఆదేశం

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Share Us