7 learning and education apps offering free access during the coronavirus lockdown| (Photo Credits: PTI)

NewDelhi, June 11: నీట్ మరియు జెఇఇ మెయిన్ 2020 తయారీ కోసం ఎన్‌టిఎ ప్రారంభించిన నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ (National Test Abhyas APP) విజయవంతం అయింది. యాప్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం (JEE Main, NEET preparation) కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ వార్త అవాస్తవం, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం, ఇమేజీతో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ వివరాల్ని పోస్ట్ చేసిన పీఐబీ

ఈ యాప్ (National Test Abhyas) విడుదలయిన కొద్ది రోజుల్లోనే జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న లక్షల మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ యాప్ వాడుతున్న వారిలో 45 శాతం మంది వినియోగదారులు సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, వీరిలో 37 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లకు వెళ్లేందుకు స్థోమత లేని వారు.

నీట్ మరియు జెఇఇ మెయిన్ 2020 కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి మే 19 న నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను ఎన్‌టిఎ ప్రారంభించింది. ఈ యాప్‌లో జెఇఇ మెయిన్ మరియు నీట్ పరీక్షలకు సంబంధించి మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. విద్యార్థులు ప్రతిరోజూ తాజా మాక్ టెస్ట్ తీసుకోవచ్చు. విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి యాప్ AI ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో ప్రిపరేషన్ అయ్యేవారి యొక్క ప్రాంతాలను కూడా విశ్లేషిస్తుంది. విద్యార్థులు పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఆండ్రాయిడ్‌లో మరియు త్వరలో iOS ప్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది.

Here's Union Human Resource Development Minister Ramesh Pokhriyal Nishank Tweet

జెఇఇ మెయిన్ 2020 జూలై 18 నుండి 23 వరకు నిర్వహించాల్సి ఉండగా, నీట్ 2020 జూలై 26 న నిర్వహించబడుతుంది. జెఇఇ మెయిన్ 2020 అడ్మిట్ కార్డు జూలై 3 న విడుదల అవుతుంది మరియు నీట్ కోసం జూలై 11 న అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి.

జేఈఈ మెయిన్‌, నీట్‌- 2020 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నమూనా పరీక్షలు (మాక్‌ టెస్టులు) రాసేందుకు ఉపయోగపడే ‘నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ (Minister Ramesh Pokhriyal Nishank) తాజాగా ఆవిష్కరించిన విషయం విదితమే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభివృద్ధి చేసిన ‘నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ జేఈఈ మెయిన్, నీట్‌ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని లాంచింగ్ సంధర్భంగా ఆయన తెలిపారు.



సంబంధిత వార్తలు

Kota Suicides: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య, ఈ ఏడాది 9కి చేరిన విద్యార్థులు సూసైడ్ కేసుల సంఖ్య, తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు

Kota Kidnapping Case: రూ.30 లక్షల డబ్బు కోసం తండ్రితో కిడ్నాప్ నాటకం ఆడిన కూతురు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలను పంపి..

Kota Suicides: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య, ఈ ఏడాది 29కి చేరిన ఆత్మహత్యలు, ఏడాది వారిగా విద్యార్థుల మరణాలపై రాజస్థాన్‌ పోలీస్‌ డేటా ఇదిగో..

Kota Suicides: కోటాలో ఆగని ఆత్మహత్యలు, తాజాగా ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్య, ఈ ఏడాది మొత్తం 28కి చేరిన బలవనర్మణాల సంఖ్య

JEE Syllabus: జేఈఈలో సిలబస్‌ తగ్గింపు.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాల తొలగింపు.. మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల

Kota Suicides: వెంటాడిన నీట్ భయం, కోటాలో 24కు చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు, రెండు నెలల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు

Sudden Heart Attack Death: తీవ్ర విషాదం, కాలేజీ మెట్లు ఎక్కుతుండగా విద్యార్థినికి గుండెపోటు, ఆస్పత్రికి తీసుకు వెళ్ళేలోగానే మృతి

TS EAMCET 2023 Exam Date: రేపటి నుంచే టీఎస్‌ ఎంసెట్‌, విద్యార్థులకు బయోమెట్రికల్ తప్పనిసరి, ఈ సూచనలు తప్పక పాటించాలని తెలిపిన అధికారులు