
Vijayawada, FEB 23: గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ (APPSC Group 2) జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ ఇనిషియల్ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in లో కీ చూసుకోవచ్చని ఏపీసీఎస్సీ తెలిపింది. అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలు, కీ పై ఎలాంటి సందేహాలు ఉన్నా ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపొచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది.
ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. వారిలో 92శాతం మంది హాజరయ్యారు.