TET Exams: తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు... జూన్ 2 వరకు ఎగ్జామ్స్.. రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు.. ఈ ఏడాది టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు

తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.

Exams (Credits: Wikimedia Commons)

Hyderabad, May 20: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TET) నేటి నుంచి ప్రారంభం కానున్నది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు.

ప్రారంభమైన 5వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఓటింగ్.. బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, ఓటు హక్కు వినియోగించుకోనున్న 8.95 కోట్ల మంది ఓటర్లు.. రేసులో రాహుల్ గాంధీ, రాజ్‌ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు

ఏ పేపర్ కి ఎంతమంది దరఖాస్తు?

టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.

ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు