Covid in India: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు మృతి, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల చనిపోలేదంటున్న వైద్యులు, కరోనాతో కేరళలో సీపీఎం ఎమ్మెల్యే మృత్యువాత, దేశంలో అత్యంత తక్కువగా 10,064 కేసులు నమోదు
గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ (Coronavirus in India) సంక్రమించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
New Delhi, Jan19: గత ఏడు ఎనిమిది నెలల్లో ఇండియాలో అత్యల్ప స్థాయిలో కేసులు (India Daily Covid Cases Drop) నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ (Coronavirus in India) సంక్రమించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే రికవరీ అయిన వారిలో 1.02 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైన నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం విశేషం. ఇప్పటి వరకు ఇండియాలో 3.8 లక్షల మంది కరోనా టీకాను ఇచ్చారు.
గత 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లోనూ కూడా ఇండియా అత్యల్ప రికార్డు నమోదు చేసింది. కోవిడ్ వైరస్ బారిన పడినవారిలో కేవలం 137 మంది మాత్రమే నిన్న మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 1,52,556కు చేరుకున్నది. గత ఏడాది జూన్ 11వ తేదీన పది వేల కన్నా తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ రోజున 9996 మందికి వైరస్ సంక్రమించింది. అయితే 8 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ దేశంలో పాజిటివ్ కేసులు పదివేల వద్దే ఆగిపోయాయి.
కరోనా వైరస్ (Coronavirus) సోకి కేరళలో సీపీఎం ఎమ్మెల్యే కేవీ విజయదాస్(61) మృతి చెందారు. విజయదాస్ (Vijay das) కొంగడ్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి (Kerala) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి (CPM MLA Dies With Corona) పార్టీకి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు పండాళం సుధాకరణ్పై విజయదాస్ 13 వేల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేకు భార్య ప్రేమకుమారి, ఇద్దరు కుమారులు జయదీప్, సందీప్ ఉన్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాజస్థాన్ సర్కారు రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్... సాయంత్రం ఏడు గంటల తరువాత మార్కెట్ మూసివేయాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో ఆర్టీ-పీసీఆర్ టెస్టుల రుసుమును రూ. 800 నుంచి రూ. 500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు ఇంతవరకూ విధించిన నిబంధనలను కొంతమేరకూ సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్లోనూ, మరొకరు కర్ణాటకలోనూ మరణించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్–డి ఉద్యోగి నాగరాజు (43) కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రెండో రోజు మరణించాడు. అయితే ఈ మరణం హార్ట్ అటాక్ వల్ల వచ్చిందని, వ్యాక్సినేషన్ వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పోస్ట్ మార్టం వరకూ ఆగాల్సి ఉంటుందని అన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ ఆరోగ్య కార్యకర్త మృతిచెందాడు. అయితే, కరోనా టీకా సంబంధిత మరణం కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గుండె–శ్వాసకోశ సంబంధిత వ్యాధితోనే మహిపాల్ మృతిచెందాడని శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. మహిపాల్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామని మొరాదాబాద్ కలెక్టర్ రాకేశ్సింగ్ చెప్పారు.
Tags
సంబంధిత వార్తలు
Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు
Arvind Kejriwal Bail Plea: ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, చరిత్రలో తొలిసారిగా పార్టీ పేరును నిందితులుగా పేర్కొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Telangana Techie Dies in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి, ఒక ప్రమాదం నుంచి బయటపడినా మరో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..
Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
Wife Swapping Case: యూపీలో దారుణం, నా ఫ్రెండ్తో నీవు గడుపు..అతని భార్యతో నేను గడుపుతానంటూ భార్యకు భర్త చిత్రహింసలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు
Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)