Madhya Pradesh Shocker: వైద్యం అందక తల్లి ఒడిలోనే కన్నుమూసిన ఐదేళ్ల బాలుడు, మధ్యప్రదేశ్‌లో దారుణం, ఐదు నిమిషాల్లో రావాల్సిన డాక్టర్..ఎంత సేపటికీ రాకపోవడంతో నిస్సహాయంగా ఎదురుచూసిన తల్లి

ఓ తల్లి తన ఐదేళ్ల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేరు, కాసేపు ఆగమని చెప్పారు. అలా ఆమె గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఓదార్చుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. ఎంత సేపటికీ ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఎంత సేపటికీ వైద్యం అందక ఆ పసి బిడ్డ తల్లి ఒడిలోనే ప్రాణం (Child died) విడిచింది.

Bhopal, SEP 01: పేదలకు సరైన విద్య, వైద్యం అందనిద్రాక్షగానే మిగిలిపోతోంది. లాభపేక్ష లేకుండా అందించాల్సిన ఈ రెండు సేవలు అతిపెద్ద వ్యాపారాలు అయ్యాయి. కార్పొరేట్‭లో ఫీజులు భరించలేము, ప్రభుత్వం నడిపే వాటిలో పట్టింపే ఉండదు. పేదల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు (govt. hospital), ప్రభుత్వ వైద్యుల పనితీరు గురించి చెప్పాలంటే తాజాగా మధ్యప్రదేశ్ (Madhya pradesh) రాష్ట్రంలో జరిగిన ఒక ఘటనే మంచి ఉదాహరణ. ఓ తల్లి తన ఐదేళ్ల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేరు, కాసేపు ఆగమని చెప్పారు. అలా ఆమె గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఓదార్చుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. ఎంత సేపటికీ ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఎంత సేపటికీ వైద్యం అందక ఆ పసి బిడ్డ తల్లి ఒడిలోనే ప్రాణం (Child died) విడిచింది.

Father’s 5th Marriage Stopped by Childeren: ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి, పీటల మీదనే చితకబాదిన కొడుకులు, 55 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లికి రెడీ అయిన యూపీ వ్యక్తి 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‭పూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగిందీ దారుణం. మరణించిన చిన్నారి పేరు రిషీ. తండ్రి సంజయ్ పండ్రే (Sanjay pandre) మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం ఎదుట ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క డాక్టర్ అయినా తన బిడ్డకు వైద్యం చేయడానికి రాలేదని, అసలు తమను పట్టిచుకోనే లేదని దు:ఖించాడు. ఈ విషయమై సదరు కేంద్రం డాక్టర్‭ను ప్రశ్నించగా.. ముందు రోజు రాత్రి తన భార్య ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్య కేంద్రానికి రావడం ఆలస్యమైందని సమాధానం ఇచ్చాడు.

Murugha Mutt Seer Sex Scandal: మైన‌ర్ బాలిక‌ల‌పై స‌న్యాసి లైంగిక దాడి, మ‌ఠాధిప‌తి శివ‌మూర్తి మురుగపై లుక్అవుట్ నోటీసు జారీ చేసిన క‌ర్నాట‌క పోలీసులు 

ఈ ఘటనతో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంపై మరోసారి విమర్శలు చెలరేగాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రీ సరిగా లేదని, జిల్లా స్థాయి ఆసుపత్రుల నుంచి పీహెచ్‭సీల వరకు వైద్య సదుపాయాలు ఏమాత్రం లేవని, వైద్యులు సరిగా లేరని, ఉన్నా సమయ పాలన పాటించరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, తాజా ఘటనపై ప్రభుత్వ అధికారులు ఎవరూ ఇంకా స్పందించలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement