Madhya Pradesh Shocker: నొప్పని ఏడుస్తున్నా వదలని కామాంధులు, కాబోయే పెళ్ళికూతురిని పొదల్లోకి లాక్కెళ్లి ఆరుమంది సామూహిక అత్యాచారం, దారుణానికి పాల్పడిన వారిని ఎవ్వరినీ వద్దలొద్దని ఎంపీ సీఎం ఆదేశాలు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 3 ఏళ్ల నర్సరీ విద్యార్థిని తన పాఠశాల బస్సులో అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసిన కొద్ది రోజులకే ( Second Such Incident in a Week), రాష్ట్రంలో మరో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Rewa, Sep 19: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 3 ఏళ్ల నర్సరీ విద్యార్థిని తన పాఠశాల బస్సులో అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసిన కొద్ది రోజులకే ( Second Such Incident in a Week), రాష్ట్రంలో మరో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 17 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Teenage Girl Gangraped) పాల్పడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. ఆరో నిందితుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం, ఓ వ్యక్తి బాలిక ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను కలుసుకుని, బాలికను ఆలయానికి తీసుకెళ్లాడు. దర్శనం తర్వాత, వారు ఆలయం వెనుక ఉన్న అడవిలో షికారు చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారు యువకుడిపై దాడి చేసి, అతనిని కొట్టి, ఆ జంటను పొదల్లోకి లాగారు, అక్కడ వారు అమ్మాయిపై అత్యాచారానికి (Teenage Girl Gangraped by 6 in Rewa) పాల్పడ్డారు. నొప్పి పుడుతోంది ప్లీజ్ వదిలేయండని వేడుకున్నా కామాంధులు కనికరించలేదు.

ప్రియుడు కళ్ల ముందే ప్రియురాలిపై 5 మంది సామూహిక అత్యాచారం, అనంతరం వారి మొబైల్స్ లాక్కెళ్లిన కామాంధులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

సహాయం కోసం కేకలు వేయాలని లేదా ఎవరికైనా విషయం చెప్పాలని ధైర్యం చేస్తే చంపేస్తామని నేరస్థులు బెదిరించారు. ఒక గంట చిత్రహింసల తర్వాత, రేపిస్టులు తమ బెదిరింపులను గుర్తు చేస్తూ వెళ్లిపోయారు. ఎఫ్‌ఐఆర్ తర్వాత, జిల్లా పోలీసులు చర్యకు దిగారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఇద్దరు మైనర్‌లతో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రేవా ఎస్పీ ప్రకారం, ముగ్గురు అనుమానితులను రేవా నుండి అరెస్టు చేశారు, మరో ఇద్దరు ముంబై నుండి పట్టుబడ్డారు, ఆరవ వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతోందని అన్నారు.

దెయ్యాలు వదిలిస్తానంటూ అత్తాకోడళ్లపై దారుణంగా అత్యాచారం, నగ్నంగా పూజలో కూర్చోబెట్టి దేవత ఆ పని చేయాలని చెప్పిందంటూ ఇద్దరిపై తెగబడిన కామాంధుడు

సోమవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేవా జిల్లా పోలీసుల నుండి నివేదికలు కోరారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో జరిగిన డిజిటల్ సమావేశంలో సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. “ఎవరి మాట వినవద్దని, సామూహిక అత్యాచార ఘటనలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను మీకు ఆదేశాలు ఇస్తున్నానని తెలిపారు. వారు మైనర్‌లు అయినప్పటికీ విడిచిపెట్టవద్దని సమావేశంలో చౌహాన్ అన్నారు.

బస్సులో చిన్నారిపై తెగబడిన కామాంధుడు, గొంతు నొక్కిపెట్టి మూడున్నరేళ్ల విద్యార్థినిపై డ్రైవర్ దారుణంగా అత్యాచారం,దారుణానికి సహకరించిన ఆయా

బుల్‌డోజర్‌లను ఉపయోగించి ఐదుగురు అనుమానితుల ఇళ్లను కూల్చివేశారని, ఆరో నిందితుడిపై కూడా అదే చర్య జరుగుతుందని విచారణకు నాయకత్వం వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధిత యువతికి 18 ఏళ్లు నిండిన తర్వాత మరో మూడు నెలల్లో ఆమెతోపాటు ఉన్న యువకుడితో పెళ్లి నిశ్చయమైనట్లు ఆ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement