Madhya Pradesh Shocker: బస్సులో చిన్నారిపై తెగబడిన కామాంధుడు, గొంతు నొక్కిపెట్టి మూడున్నరేళ్ల విద్యార్థినిపై డ్రైవర్ దారుణంగా అత్యాచారం,దారుణానికి సహకరించిన ఆయా
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల నర్సరీ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ మహిళా సహాయకురాలి సమక్షంలో అత్యాచారానికి (Nursery kid raped inside school bus) పాల్పడ్డాడు. నోరు నొక్కిపెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Bhopal, Sep 13: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల నర్సరీ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ మహిళా సహాయకురాలి సమక్షంలో అత్యాచారానికి (Nursery kid raped inside school bus) పాల్పడ్డాడు. నోరు నొక్కిపెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనలో ఆమె నేరాన్ని కప్పిపుచ్చడానికి (woman helper tried to cover Up Crime ) ప్రయత్నించింది.
పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. విద్యార్థిని తల్లి శరీరంపై గుర్తులు చూసి ఏమైందని ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె ఈ కీచక పర్వాన్ని తన తల్లికి చెప్పగానే, కుటుంబం పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించింది.
వారు ఈ ఆరోపణలను ఖండించారు.దీని తర్వాత ఆ పాప తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అరెస్టు చేసి, అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ నేరాన్ని దాచడానికి ప్రయత్నించిన సహాయకుడిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, పాఠశాల అధికారులు కూడా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని, వారిని కూడా విచారిస్తామని, దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 08:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

