Uttar Pradesh Shocker: యూపిలో గర్భవతిపై తెగబడిన కామాంధులు, పొలంకి వెళుతుండగా పొదల్లోకి లాక్కెళ్లి ముగ్గురు దారుణంగా అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Pregnant woman gang-raped) పాల్పడ్డారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలని జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bareilly, Sep 22: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Pregnant woman gang-raped) పాల్పడ్డారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలని జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సెప్టెంబరు 13న మజ్‌గవాన్ గ్రామంలోని బిషారత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంత పని నిమిత్తం పొలానికి వెళ్లిన 3 నెలల గర్భిణిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఇంతలో, మహిళ చాలా సేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా పొదల్లో అపస్మారక స్థితిలో ఆమె కనిపించింది. దీంతో ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ఆ మహిళకు గర్భస్రావం (suffers miscarriage in Bareilly) అయిందని వైద్యులు తెలిపారు.తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ప్లాస్టిక్‌ డబ్బాలో పిండంతో ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఓ వైపు రక్తం కారుతూ, మరో వైపు నొప్పితో ఏడుస్తున్నా వదలని కామాంధులు, మైనర్ బాలికను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి బట్టలు లేకుండా ఇంటికి పంపించిన కిరాతకులు

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ దేహత్ రాజ్‌కుమార్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు. మహిళ వాంగ్మూలం తీసుకున్నామని, నిజానిజాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Advertisement
Advertisement
Share Now
Advertisement