Telangana: దసరా తర్వాత ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 60 లేదా 61 ఏళ్లకు పెంపు. పైరవీలు లేకుండానే ఉద్యోగులకు ప్రమోషన్లు, పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేస్తామని టీఎస్ సీఎం కేసీఆర్ ప్రకటన.

పంచాయతీ రాజ్ శాఖలో అన్ని ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500కు పెంచినట్లు సీఎం తెలిపారు...

File Image of Telangana CM KCR

Hyderabad, September 04:   గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని అధికారులకు సూచించారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ప్రజాప్రతినిధుల వద్ద, తమ ఉన్నత అధికారుల వద్ద పైరవీలు చేసే దుస్థితి పోవాలని సీఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని సీఎం వెల్లడించారు.

మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అలాగే, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

పంచాయతీ రాజ్ శాఖలో అన్ని ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500కు పెంచినట్లు సీఎం తెలిపారు.

గ్రామ పంచాయతీల కోసం ప్రభుత్వం నెలకు 339 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నదని సీఎం చెప్పారు. ఒక ఏడాది ఖర్చు చేయగా మిగిలిన నిధులను, వచ్చే ఏడాదికి బదిలీ చేసేలా చట్టంలో నిబంధన చేర్చినట్లు పేర్కొన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ఇప్పటికే అమలులోకి వచ్చింది. అందులో సర్పంచులు మరియు అధికారుల బాధ్యతలను, నిర్వర్తించాల్సిన విధులను స్పష్టంగా పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులపై కలెక్టర్లు చర్య తీసుకుంటే, స్టే ఇచ్చే అధికారం మంత్రులకు కూడా లేకుండా చట్టంలోనే నిబంధనలున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement