Uttar Pradesh: ఇదేమి నిర్లక్ష్యపు వైద్యం, మహిళ కడుపులో టవల్ పెట్టి ఆపరేషన్ చేసిన వైద్యుడు, 5 రోజులు కడుపునొప్పితో అల్లాడిపోయిన బాధితురాలు, మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఘటన వెలుగులోకి..

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి (Doctor leaves towel inside) నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేశాడు అక్కడి వైద్యుడు. అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Amroha Chief Medical Officer Rajeev Singhal (Photo-ANI)

Lucknow, Jan 4: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి (Doctor leaves towel inside) నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేశాడు అక్కడి వైద్యుడు. అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకెళ్తే.. నజరానా అనే మహిళ నెలలు నిండటంతో ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. ఐతే అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె కడుపులో (woman's stomach) టవల్‌ ఉంచేసి ఆపరేషన్‌ చేశారు డాక్టర్‌ మత్లూబ్‌.

విమానంలో దారుణం, ఫ్యాంట్ జిప్పి విప్పి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖ రాసిన బాధితురాలు

ఆపరేషన్ తర్వాత ఆ మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్‌ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు బాధితురాలి కడుపులో టవల్‌ ఉందని, ఆపరేషన్‌ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

ఎయిరిండియా విమానంలో పాము కలకలం, దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో గుర్తించిన సిబ్బంది, విచారణకు ఆదేశించిన డీజీసీఏ

దీంతో అలీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ) రాజీవ్‌ సింఘాల్‌ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్‌ అధికారి డాక్టర్‌ శరద్‌ను ఆదేశించారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని (CMO orders probe) సీఎంవో అధికారి సింఘాల్‌ చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement