Uttar Pradesh Horror: ఏడాది చిన్నారిపై మంత్రగాడు దారుణం, కుద్ర పూజలు పేరిట పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టిన భూత వైద్యుడు, చోద్యం చూస్తూ నిలబడ్డ తండ్రి

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఏడాది చిన్నారిని క్షుద్ర వైద్యుడి వద్దకు తీసుకెళ్లి, పళ్లు విరగ్గొట్టి, నేలపై పడేసి చంపిన ఘటన దారుణ ఘటన (Uttar Pradesh Horror) చోటు చేసుకుంది.

Representational image | (Photo Credits: Pixabay)

Bulandshahr, Feb 10: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఏడాది చిన్నారిని క్షుద్ర వైద్యుడి వద్దకు తీసుకెళ్లి, పళ్లు విరగ్గొట్టి, నేలపై పడేసి చంపిన ఘటన దారుణ ఘటన (Uttar Pradesh Horror) చోటు చేసుకుంది. బులంద్‌షహర్ జిల్లా ధాకర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అనుజ్‌ను గురువారం రాత్రి క్వాక్‌కి తీసుకెళ్లినట్లు అతని మామ సౌరభ్ తెలిపారు.స్థానిక తాంత్రికుడిగా పోలీసులు అభివర్ణించిన మంత్రగాడు చిన్నారి పళ్లను విరగ్గొట్టి నేలపై (Toddler dies after teeth broken) పడేశాడు.

బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని గుర్తించిన కుటుంబ సభ్యులు అర్థరాత్రి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కలత చెందిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లో దారుణ హత్య, బండరాయితో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన దుండగులు, తాగిన మత్తులో గొడవ జరిగిందనే అనుమానాలు

తాంత్రికుడిని అరెస్టు చేశామని, చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని, తమ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న చిన్నారి న్యుమోనియాతో బాధపడుతోంది.గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో పురోగతి ఉన్నప్పటికీ, వైద్యుల కొరత కారణంగా గ్రామాల్లోని అనేకమంది ఇప్పటికీ చికిత్స కోసం మంత్రగాళ్లపై ఆధారపడుతున్నారు.

దేశంలో దాదాపు 10 లక్షల మంది అల్లోపతి వైద్యాన్ని అభ్యసిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది.కాగా మధ్యప్రదేశ్‌లో మూడు నెలల బాలిక కడుపుపై ​​వేడి ఇనుప రాడ్‌తో "చికిత్స"లో భాగంగా 51 సార్లు పొడిచి చంపిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది.

పోలీస్ అధికారి కాదు కామాంధుడు, 12 మంది మహిళలపై దారుణంగా అత్యాచారం, 36 జీవిత కాల శిక్షలు అనుభవించాలని యూకే కోర్టు తీర్పు

బులంద్‌షహర్‌ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు సరిపడా లేవని, ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరని, ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లాలంటే పేదలకు మోయలేని ఆర్థిక భారమని.. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement