Uttar Pradesh: పొలంలో గడ్డి కోస్తుండగా తెగబడిన కామాంధులు, 55 ఏళ్ళ మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం, యూపీలో దారుణ ఘటన

యూపీలో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడులు (Uttar Pradesh Shocker) పెరిగిపోతున్నాయి. తాజాగా గ్రేట‌ర్ నోయిడా ప్రాంతంలోని జెవ‌ర్ గ్రామంలో 55 ఏండ్ల మ‌హిళ‌పై సామూహిక లైంగిక దాడి (55-year-old woman gang-raped) జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం కాగా ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Lucknow, Oct 11: యూపీలో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడులు (Uttar Pradesh Shocker) పెరిగిపోతున్నాయి. తాజాగా గ్రేట‌ర్ నోయిడా ప్రాంతంలోని జెవ‌ర్ గ్రామంలో 55 ఏండ్ల మ‌హిళ‌పై సామూహిక లైంగిక దాడి (55-year-old woman gang-raped) జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం కాగా ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

యూపీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మ‌హిళ ప‌శువుల మేత కోసం పొలానికి వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న దుండ‌గులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడిగా గుర్తించిన‌ మ‌హేంద్ర మ‌త్తుప‌దార్ధాల‌కు బానిస‌య్యాడు. మ‌హేంద్ర అత‌డి ముగ్గురు స్నేహితులు బాధితురాలిపై దారుణానికి ఒడిగ‌ట్టారు. మ‌హిళ స్పృహ కోల్పోయిన స్థితిలో (left bleeding in Greater Noida) నిందితులు ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి ప‌రార‌య్యారు. ఆమెను కాపాడిన స్ధానికులు తీవ్ర ర‌క్త‌స్రావ‌మవడంతో నోయిడాలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు మూడు బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని త్వ‌ర‌లోనే వారిని అరెస్ట్ చేస్తామ‌ని నోయిడా డీసీపీ వృందా శుక్లా పేర్కొన్నారు.

గే లే వారి టార్గెట్, సెక్స్ చేసుకుందామంటూ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి నిలువు దోపిడి చేయడమే వారి పని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన నోయిడా పోలీసులు

స్థానిక పోలీసుల బృందం కూడా నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి సంఘటన స్థలం నుండి ఆధారాలను సేకరించింది. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలు పనిచేస్తున్నాయని డీసీపీ (నోయిడా) బృందా శుక్లా తెలిపారు. కాగా బాధితురాలికి ఒక నిందితుడి గురించి తెలుసు. కొంతమంది గ్రామస్తుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయబడ్డాయి. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు.

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కొత్తేమీ కాదు. అజమ్‌గఢ్‌లో, ఒక మహిళ తన రేప్ కేసులో పోలీసుల నిష్క్రియాత్మకత కారణంగా శనివారం పోలీస్ స్టేషన్ వెలుపల విషపూరిత పదార్థాన్ని సేవించింది. తరువాత, కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సస్పెన్షన్‌కు గురయ్యారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement