Bihar Polls: బీహార్లో బీజేపీ దూకుడు, అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం, ఎన్డీయే కూటమికి బీహారీలు పట్టం కట్టబోతున్నారా ? 129 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం, మహాఘట్ బంధన్ 99 స్థానాల్లో ఆధిక్యం
తొలి రౌండ్లలో ఆర్జేడీ పలుచోట్ల ఆధిక్యం కనబరిచినప్పటికీ క్రమంగా బీజేపీ ఆధిక్యం (Bihar Assembly Elections 2020 Results) పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, బీహార్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా (single-largest party) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Patna, Nov 10: బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ శర వేగంగా మారుతోంది. తొలి రౌండ్లలో ఆర్జేడీ పలుచోట్ల ఆధిక్యం కనబరిచినప్పటికీ క్రమంగా బీజేపీ ఆధిక్యం (Bihar Assembly Elections 2020 Results) పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, బీహార్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా (single-largest party) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే మెజారిటీ మార్క్ను దాటే అవకాశాలు కూడా మరింతగా కనిపిస్తున్నాయి. మొత్తం 243 స్థానాలకు గాను 129 స్థానాల్లో ఎన్డీయే (NDA) ఆధిక్యం కొనసాగిస్తోంది. మహాఘట్ బంధన్ (Mahaghat Bandhan) 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బీజేపీ 74 స్థానాల్లో, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ (JDU) 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ (RJD) 59 స్థానాల్లో, కాంగ్రెస్ (Congress) 21 స్థానాల్లో, ఎల్జేపీ (LJP) 5 స్థానాల్లో, వీఐపీ 7 స్థానాల్లో, ఇతరులు 29 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్థానాల్లో మెజారిటీ మార్క్ను దాటాలంటే ఇటు ఎన్డీయే కానీ, అటు మహాఘట్ బంధన్ కానీ 122 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది.
రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్న మహాఘటన్ బంధన్ (ఎంజీబీ) సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ 700 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఆదిక్యంలో ఉన్నారు. జాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జీవేశ్ కుమార్ 2538 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ వందకుపైగా స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.
38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు రాజధాని పట్నాలో ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తొలుత ఆదిక్యం కనబరిచిన కాంగ్రెస్-ఆర్జేడీ మహాఘట్ బంధన్ వెనకంజలో కొనసాగుతుండటంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనౌతున్నారు. కౌంటింగ్ సరళిని బట్టి ఎన్డీఏ కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్ ఫిగర్ 122.
Tags
సంబంధిత వార్తలు
AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి
Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు
Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు
Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..
Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ
Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..
Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ
Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ