Vasant Panchami 2023: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు, గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం
తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు.
తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భక్తులకు అనుమతి లేదని తెలిపారు.
అనంతరం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వ తరుఫున మంత్రి, ఎమ్మెల్యేలు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారని వివరించారు. అక్షరాభ్యాసం వేకువ జామున 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మిగతా ఆర్జిత సేవలు 26న ఉండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లో పండ్లు, మంచినీరు, పాలు అందించనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement