Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Hyderabad, July 20: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు  ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయిబాబాను దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించడం ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకం. జగతిని జాగృతపరిచిన గురుదేవులను నేడు పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.

రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది? 

తెలుగు రాష్ట్రాల్లో శోభ

ఇక గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌ నగర్‌ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని బాలసముద్రం సాయిబాబా గుడిలో భక్తులు బారులుతీరారు. ఖమ్మంలో బాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌ లోని అమిస్తాపూర్‌ సాయిబాబా గుడిలో​, కరీంనగర్​, నిజామాబాద్​, సంగారెడ్డి, నల్లగొండతో పాటు ఏపీలోని పలు ఆలయాల్లో సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ నెలకొన్నది.

ఏపీలో ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ, కీల‌క శాఖ‌ల క‌మిష‌నర్ల మార్పు, బ‌దిలీ అయిన వారి పూర్తి లిస్ట్ ఇదుగో...

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్‌జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..

Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Advertisement
Advertisement
Share Now
Advertisement