Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident (Credits: X)

Newdelhi, Dec 3: కేరళలో (Kerala) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది.

వీడియో ఇదిగో, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం

Here's Video:

అందుకే??

వర్షం, రాత్రి వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులంతా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement