Strange Incident in Rajasthan: హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందంటూ పైలెట్ పై ఫిర్యాదు చేసిన గ్రామస్థుడు.. తన గేదె విలువ రూ.1.5 లక్షలని వెల్లడి.. పైలెట్ పై చర్యలు తీసుకోవాలని వినతి.. రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన

రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందని ఓ గ్రామస్థుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Credits: Video Grab

Jaipur, Nov 15: రాజస్థాన్ లో (Rajasthan) విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ (Helicopter) వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో (Sound) తన గేదె (Buffalo) చనిపోయిందని ఓ గ్రామస్థుడు (Villager) ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బహ్రోద్ నియోజకవర్గ శాసనసభ్యుడు బల్జీత్ యాదవ్ ఇటీవల ఓ గ్రామంలో పర్యటించారు. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ ఎమ్మెల్యేపై ఆకాశం నుంచి పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ను వినియోగించారు. ఎమ్మెల్యే పర్యటనకు వచ్చిన సమయంలో పూలవర్షం కురిపించిన ఆ లోహవిహంగం, కొంతసేపు అక్కడే చక్కర్లు కొట్టి కొహ్రానా అనే గ్రామం మీదుగా తక్కువ ఎత్తు నుంచి వెళ్లిపోయింది.

నిత్యానంద ‘కైలాసం’లో ఉద్యోగాలు.. ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటన

అయితే, బల్వీర్ అనే వృద్ధుడికి చెందిన గేదె ఒకటి ఆ సమయంలో మృతి చెందింది. హెలికాప్టర్ భారీ శబ్దం చేసుకుంటూ వెళ్లడం వల్లే తన గేదె చనిపోయిందని ఆ వృద్ధుడు చెబుతున్నాడు. తన గేదె విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, పైలెట్ ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఆ గేదెను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. గేదె ఎందుకు చనిపోయిందన్నది పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలుస్తుందని, ఒకవేళ హెలికాప్టర్ శబ్దం వల్లే చనిపోయినట్టయితే అప్పుడు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Strange Incident in Rajasthan: హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందంటూ పైలెట్ పై ఫిర్యాదు చేసిన గ్రామస్థుడు.. తన గేదె విలువ రూ.1.5 లక్షలని వెల్లడి.. పైలెట్ పై చర్యలు తీసుకోవాలని వినతి.. రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Advertisement

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Advertisement
Advertisement
Share Now
Advertisement