Strange Incident in Rajasthan: హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందంటూ పైలెట్ పై ఫిర్యాదు చేసిన గ్రామస్థుడు.. తన గేదె విలువ రూ.1.5 లక్షలని వెల్లడి.. పైలెట్ పై చర్యలు తీసుకోవాలని వినతి.. రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన

తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందని ఓ గ్రామస్థుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Credits: Video Grab

Jaipur, Nov 15: రాజస్థాన్ లో (Rajasthan) విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ (Helicopter) వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో (Sound) తన గేదె (Buffalo) చనిపోయిందని ఓ గ్రామస్థుడు (Villager) ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బహ్రోద్ నియోజకవర్గ శాసనసభ్యుడు బల్జీత్ యాదవ్ ఇటీవల ఓ గ్రామంలో పర్యటించారు. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ ఎమ్మెల్యేపై ఆకాశం నుంచి పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ను వినియోగించారు. ఎమ్మెల్యే పర్యటనకు వచ్చిన సమయంలో పూలవర్షం కురిపించిన ఆ లోహవిహంగం, కొంతసేపు అక్కడే చక్కర్లు కొట్టి కొహ్రానా అనే గ్రామం మీదుగా తక్కువ ఎత్తు నుంచి వెళ్లిపోయింది.

నిత్యానంద ‘కైలాసం’లో ఉద్యోగాలు.. ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటన

అయితే, బల్వీర్ అనే వృద్ధుడికి చెందిన గేదె ఒకటి ఆ సమయంలో మృతి చెందింది. హెలికాప్టర్ భారీ శబ్దం చేసుకుంటూ వెళ్లడం వల్లే తన గేదె చనిపోయిందని ఆ వృద్ధుడు చెబుతున్నాడు. తన గేదె విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, పైలెట్ ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఆ గేదెను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. గేదె ఎందుకు చనిపోయిందన్నది పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలుస్తుందని, ఒకవేళ హెలికాప్టర్ శబ్దం వల్లే చనిపోయినట్టయితే అప్పుడు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.